rajasekhar: ఓ అమ్మాయి థియేటర్ లోనే నన్ను కిస్ చేసింది: రాజశేఖర్

  • 'తలంబ్రాలు' సినిమా చేయకూడదనుకున్నా
  • జీవిత సింగిల్ టేక్ లోనే చేసేసేది
  • ఒక్కసారైనా రెండో టేక్ తీసుకోకపోదా అంటూ ఎదురు చూసేవాడిని

వాస్తవానికి 'తలంబ్రాలు' సినిమాను మొదట తాను చేయకూడదని అనుకున్నానని హీరో రాజశేఖర్ చెప్పారు. అయితే శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఓసారి కథ వినమన్నారని... ఆ తర్వాత సబ్జెక్ట్ బాగా నచ్చడంతో సినిమా చేశానని తెలిపారు. ఆ సినిమాలో విలనే హీరో అని చెప్పారు. 'అలీతో సరదాగా' కార్యక్రమంలో ముచ్చటిస్తూ రాజశేఖర్ ఈ విషయాన్ని తెలిపారు.

'తలంబ్రాలు' సినిమాలో చేస్తున్నప్పుడు ఎన్ని పేజీల డైలాగులనైనా జీవిత సింగిల్ టేక్ లోనే చెప్పేసేదని... తనకు మాత్రం రెండు, మూడు టేకులు అవసరమయ్యేవని రాజశేఖర్ చెప్పారు. ఏంటి, ఈ అమ్మాయి ఇంత బాగా చెప్పేస్తోందంటూ... జీవిత మీద నాకు తెగ కోపం వచ్చేదని, ఒళ్లు మండిపోయేదని తెలిపారు.

ఒక్కసారైనా రెండో టేక్ తీసుకోకపోదా? అంటూ తాను ఎదురు చూసేవాడినని, అయితే ఆ అవకాశం జీవిత ఇవ్వలేదని చెప్పారు. సినిమా విడుదలయ్యాక జీవితకు మంచి పేరు వస్తుందని తాను భావించానని... అయితే, నాకే మంచి పేరు వచ్చిందని అన్నారు. ఓ అమ్మాయైతే థియేటర్ లోనే తనను కిస్ చేసిందని చెప్పారు. ఆ తర్వాత 'ఆహుతి', 'అంకుశం' సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయని... అనంతరం జీవిత, తాను పెళ్లి చేసుకున్నామని తెలిపారు.  

More Telugu News