Virat Kohli: కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. టీ20ల్లో 7 వేల పరుగులు చేసిన తొలి భారత ఆటగాడు!

  • అత్యంత వేగంగా ఏడు వేల పరుగులు సాధించిన సారథి
  • ఓవరాల్‌గా రెండో ఆటగాడు
  • అగ్రస్థానంలో కొనసాగుతున్న క్రిస్ గేల్

రికార్డులను అలవోకగా తన ఖాతాలో వేసుకుంటున్న టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మరో రికార్డు సృష్టించాడు. రాజ్‌కోట్‌లో శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో 65 పరుగులు చేసిన కోహ్లీ టీ20లలో 7 వేల పరుగులు సాధించిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కాడు. 212వ టీ20 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించడం ద్వారా అత్యంత వేగవంతంగా 7 వేల పరుగులు సాధించిన రెండో క్రికెటర్ అయ్యాడు.

కోహ్లీ కంటే ముందు విండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ 192 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను సాధించాడు. అంతేకాదు, టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తం 309 మ్యాచ్‌లు ఆడిన గేల్ 10,571 పరుగులతో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నాడు.

More Telugu News