saudi arabia: సౌదీ అరేబియాపై క్షిపణి దాడి

  • యెమన్ నుంచి దూసుకొచ్చిన క్షిపణి
  • భారీ ప్రాణనష్టమే లక్ష్యంగా క్షిపణి దాడి
  • కూల్చివేసిన సౌదీ అరేబియా

గల్ఫ్ దేశం సౌదీ అరేబియాపై క్షిపణి దాడి జరిగింది. యెమన్ దేశం నుంచి ఈ క్షిపణి దూసుకొచ్చింది. అయితే, దీనిని సౌదీ విజయవంతంగా నేలకూల్చింది. ఈ క్రమంలో దాని శకలాలు రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పడ్డాయి. ఈ మేరకు సౌదీ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. మరోవైపు, ఈ క్షిపణి దాడికి పాల్పడింది తామేనని షితే హుతి రెబల్స్ ప్రకటించుకున్నారు. వీరికి ఇరాన్ మద్దతు ఉండటం గమనార్హం.

తమపైకి దూసుకొస్తున్న క్షిపణిని కూల్చేసిన సమయంలో కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. భారీగా ప్రాణనష్టం కలిగించే లక్ష్యంతో, జనావాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి జరిగిందని అధికారులు తెలిపారు. దాదాపు 1200 కిలోమీటర్ల దూరం నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారని వెల్లడించారు. 

More Telugu News