Cricket: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

  • రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో రెండో టీ20
  • ఈ రోజు మ్యాచ్ గెలిస్తే సిరీస్ భార‌త్ సొంతం

రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మ‌రికాసేపట్లో భార‌త్‌-న్యూజిలాండ్ రెండో వ‌న్డే ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొన్న ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మొద‌టి టీ20 మ్యాచ్ లో టీమిండియా గెలుపొందిన విష‌యం తెలిసిందే. ఈ రోజు కూడా టీమిండియా విజ‌యం సాధిస్తే ఈ సిరీస్ భార‌త్ సొంత‌మ‌వుతుంది. టీ20ల్లో అగ్ర‌స్థానంలో ఉన్న న్యూజిలాండ్ తమ ర్యాంకును కోల్పోతుంది. అద్భుతంగా రాణిస్తోన్న విరాట్ కోహ్లీ సేన ఈ టీ20లోనూ గెల‌వాల‌ని ఉవ్విళ్లూరుతోంది.  

More Telugu News