karan johar: త్వ‌ర‌లో కొత్త‌ రియాలిటీ షోకి జ‌డ్జిగా రానున్న క‌ర‌ణ్ జొహార్‌!

  • న‌ట‌న‌, గానం ప్ర‌తిభ‌ను ప‌రీక్షించే షో
  • గెలిచిన వారికి ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్‌లో న‌టించే ఛాన్స్‌
  • త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఆడిష‌న్స్‌

త్వ‌ర‌లో ఓ స‌రికొత్త రియాలిటీ షోతో జ‌డ్జిగా ద‌ర్శ‌కుడు, నిర్మాత క‌ర‌ణ్ జొహార్ బుల్లితెర మీద సంద‌డి చేయ‌నున్నారు. `టికెట్ టు బాలీవుడ్‌` అనే పేరు అనుకుంటున్న ఈ షోలో పార్టిసిపెంట్ల న‌ట‌న‌, గాన ప్ర‌తిభాపాటవాల‌ను ప‌రీక్షించ‌నున్నారు. ఈ పోటీలో గెలిచిన వారికి క‌ర‌ణ్ జొహార్ నిర్మాణ సంస్థ ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌లో న‌టించే అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

గ‌తంలో 'ఇండియాస్ నెక్స్ట్ సూప‌ర్‌స్టార్' పేరిట ఉన్న కార్య‌క్ర‌మాన్నే ఇలా కొత్త రూపంలో తీసుకువ‌స్తున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ రియాలిటీ షోకు సంబంధించిన ఆడిష‌న్స్ ప్రారంభం కానున్న‌ట్లు కార్య‌క్ర‌మ నిర్వాహ‌కులు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మం స్టార్‌ప్ల‌స్ ఛాన‌ల్‌లో ప్ర‌సారం కానుంది.

More Telugu News