narayana college: నారాయ‌ణ కాలేజ్‌లో తోటి విద్యార్థిని చిత‌క్కొట్టిన 20 మంది విద్యార్థులు!

  • హైద‌రాబాద్‌లోని వ‌న‌స్థ‌లిపురం నారాయ‌ణ కాలేజ్‌లో క‌ల‌క‌లం
  • ఓ విద్యార్థిని నిక్ నేమ్‌తో పిలిచినందుకు దాడి
  • బాధిత విద్యార్థి మ‌ల్లికార్జున్ త‌ల‌కు గాయాలు
  • ఐదుగురు విద్యార్థుల‌పై కేసు న‌మోదు

హైద‌రాబాద్‌ వ‌న‌స్థ‌లిపురంలోని నారాయ‌ణ కాలేజ్‌లో క‌ల‌క‌లం చెల‌రేగింది. ఓ విద్యార్థిని నిక్ నేమ్‌తో పిలిచినందుకు మ‌ల్లికార్జున్ అనే విద్యార్థిపై దాడి జ‌రిగింది. అతనిని ఏకంగా 20 మంది విద్యార్థులు చిత‌క్కొట్టారు. దీంతో అతని త‌ల‌కు గాయాలు అయ్యాయి. అత‌డిని ఆసుప‌త్రికి త‌ర‌లించిన కాలేజీ యాజ‌మాన్యం చికిత్స అందిస్తోంది.

 ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఐదుగురు విద్యార్థుల‌పై కేసు న‌మోదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్టారు. త‌మ కుమారుడిని కొట్టిన విద్యార్థుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌ల్లికార్జున్ త‌ల్లిదండ్రులు డిమాండ్ చేశారు.  

More Telugu News