air asia: రూ. 1,299కి టికెట్లు ఆఫర్ చేసిన ఎయిర్ ఏషియా

  • 5వ తేదీ వరకూ ప్రత్యేక ఆఫర్లు
  • ఏప్రిల్, 2018లోగా ప్రయాణించాలి
  • హైదరాబాద్ - బెంగళూరు మధ్య రూ. 1,399 మాత్రమే

పరిమితకాల ప్రమోషనల్ ఆఫర్ గా రూ. 1,299కి విమానం టికెట్లను అందుబాటులోకి తెచ్చినట్టు లోకాస్ట్ ఎయిర్ లైన్స్ సంస్థ ఎయిర్ ఏషియా ప్రకటించింది. ఈ ఆఫర్ ఈ నెల 5వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుందని, ఏప్రిల్ 30, 2018లోగా ప్రయాణ తేదీని నిర్ణయించుకోవాల్సి వుంటుందని సంస్థ పేర్కొంది. ఎంపిక చేసిన విమానాల్లో ఈ ఫేర్ అమలులో ఉంటుందని వెల్లడించిన సంస్థ, ఎన్ని టికెట్లను ఆఫర్ చేస్తున్నామన్న విషయాన్ని తెలియజేయలేదు.

ఇక సంస్థ వెబ్ సైట్ లో భువనేశ్వర్ - కోల్ కతా రూట్ లో రూ. 1,299కి టికెట్లు అందుబాటులో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. కొచ్చి - బెంగళూరు, హైదరాబాద్ - బెంగళూరు,  గోవా - బెంగళూరు రూట్లలో రూ. 1,399కి, భువనేశ్వర్ - రాంచీ మధ్య రూ. 1,490కి టికెట్లు అందుబాటులో ఉన్నట్టు చూపుతోంది. గౌహతి - ఇంపాల్ మధ్య రూ. 1,499, రాంచీ - కోల్ కతా మధ్య రూ. 1,899, కోల్ కతా - వడోదరా, గోవా - హైదరాబాద్, పుణె - బెంగళూరు, విశాఖపట్నం - బెంగళూరు మధ్య రూ. 1,999కి టికెట్లను ఇవ్వనున్నట్టు వెబ్ సైట్ చూపుతోంది.

More Telugu News