xiaomi: షియోమి నుంచి మ‌రో కొత్త స్మార్ట్‌ఫోన్‌... ఈసారి టార్గెట్ సెల్ఫీ ప్రియులు!

  • రెడ్‌మీ వై1, వై1 లైట్‌ పేరుతో మార్కెట్లోకి విడుద‌ల‌
  • ఎంఐయూఐ 2ను విడుద‌ల చేసిన చైనా కంపెనీ
  • వై1 ధ‌ర రూ. 8,999, వై1 లైట్ ధ‌ర రూ. 6,999

సెల్ఫీల మోజులో ప‌డిపోయిన యువ‌త‌ను టార్గెట్ చేస్తూ, వారి కోసం ప్ర‌త్యేకంగా సెల్ఫీ సిరీస్ ఫోన్ల‌ను చైనాకు చెందిన‌ స్మార్ట్‌ఫోన్ త‌యారీ సంస్థ షియోమి భార‌తీయ మార్కెట్‌లో విడుద‌ల చేసింది. ఢిల్లీ ఓ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసి ఈ ఫోన్ల‌ను ఆవిష్క‌రించింది. రెడ్‌మీ వై1, రెడ్‌మీ వై1 లైట్ పేర్ల‌తో ఈ స్మార్ట్‌ఫోన్ల‌ను విడుద‌ల చేసింది. రెడ్‌మీ వై1లో ఎల్‌ఈడీ సెల్ఫీ లైట్‌తో 16 ఎంపీ కెమెరా ఉంది. దీని ద్వారా అత్యంత నాణ్య‌త గ‌ల సెల్ఫీల‌ను తీసుకోవ‌చ్చు.

రెడ్‌మీ వై1 మొబైల్‌ 3జీబీ ర్యామ్‌/32 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ వేరియంట్‌ ధరను రూ.8,999గా, 4జీబీ/64జీబీ వేరియంట్‌ ధరను రూ.10,999గా కంపెనీ నిర్ణ‌యించింది. అలాగే 2జీబీ ర్యామ్‌, 16జీబీ అంతర్గత స్టోరేజీతో వస్తున్న వై1 లైట్‌ మొబైల్‌ ధరను రూ.6,999గా ప్ర‌క‌టించింది. ఈ రెండు ఫోన్ల అమ్మ‌కాలు అమెజాన్‌ ఇండియా, ఎంఐ.కామ్‌ల‌లో ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆఫ్‌లైన్‌లో ఎంఐ స్టోర్ల‌లో ఈ ఫోన్లు లభించనున్నాయి. ఇదే కార్యక్రమంలో ఫ‌ర్మ్‌వేర్ ఇంట‌ర్‌ఫేస్ ఎంఐయూఐ 9ను కూడా షియోమి ఆవిష్కరించింది. త్వరలో రెడ్‌మి నోట్‌ 4, ఎంఐ మిక్స్‌ 2, ఎంఐ మ్యాక్స్‌2 ఫోన్లకు అప్‌డేట్‌ అందిస్తామని తెలిపింది.

More Telugu News