ajay bisariya: పాక్ హైకమిషనర్ ను మార్చిన భారత్

  • అజయ్ బిసారియాను నియమించిన కేంద్రం
  • 1987 బ్యాచ్ కి చెందిన ఐఎఫ్ఎస్ అధికారి
  • త్వరలోనే విధుల్లో చేరనున్న ఆజయ్
  • ప్రకటన విడుదల చేసిన విదేశాంగ శాఖ

పాకిస్థాన్ లో భారత దౌత్యాధికారిగా అజయ్ బిసారియాను నియమిస్తున్నట్టు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. 1987 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కి చెందిన అజయ్ ప్రస్తుతం పోలెండ్ లో భాతర రాయబారిగా ఉన్నారు. బుధవారం ఓ ప్రకటన విడుదల చేసిన విదేశాంగ శాఖ, అజయ్ త్వరలోనే పాక్ వెళ్లి విధుల్లో చేరతారని తెలిపారు. కాగా, ఇప్పటివరకూ పాక్ లో హై కమిషనర్ గా ఉన్న గౌతమ్ బంబావలే, ఇటీవల చైనాకు రాయబారిగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త రాయబారిగా అజయ్ ను కేంద్రం ఎంపిక చేసింది. ఢిల్లీలోని ఫారిన్ సర్వీస్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ అనంతరం అజయ్ రష్యన్ భాషను స్పెషలైజేషన్ గా ఎంచుకున్నారు.

More Telugu News