sidda ramaiah : భాష‌పై మరింత అభిమానాన్ని ప్రదర్శించాలి.. రాష్ట్రంలో ఉండేవారంద‌రికీ క‌న్న‌డ వ‌చ్చి ఉండాల్సిందే: క‌ర్ణాట‌క సీఎం

  • మా భాషపై ఎటువంటి దాడి జరిగినా ఊరుకోబోము
  • క‌ర్ణాట‌క‌లోని అన్ని స్కూళ్ల‌లో కన్నడ భాషను తప్పకుండా బోధించాలి
  • మా రాష్ట్రంలో బ్రతికే ప్రతి ఒక్కరూ కన్నడీయులే

రాష్ట్ర భాష పట్ల ప్రజలు మరింత అభిమానాన్ని ప్రదర్శించాల‌ని క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామయ్య అన్నారు. త‌మ‌ భాషపై ఎటువంటి దాడి జరిగినా ఊరుకోబోమ‌ని తేల్చి చెప్పారు. 62వ కర్ణాటక రాజ్యోత్సవ సమావేశంలో పాల్గొన్న ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య‌ మాట్లాడుతూ.. త‌మ‌ రాష్ట్రంలో నివసించేవారు ఎవరైనా కచ్చితంగా త‌మ భాష‌ను నేర్చుకోవాల్సిందేన‌ని చెప్పారు. క‌ర్ణాట‌క‌లోని అన్ని స్కూళ్ల‌లో కన్నడ భాషను తప్పకుండా బోధించాలని చెప్పారు.

త‌మ రాష్ట్రంలో బ్రతికే ప్రతి ఒక్కరూ కన్నడీయులే అని పేర్కొన్నారు. పరభాష నేర్చుకోవ‌చ్చ‌ని, కన్నడను నిర్ల‌క్ష్యం చేయ‌వ‌ద్ద‌ని చెప్పారు. క‌న్న‌డ‌ను నిర్ల‌క్ష్యం చేస్తే భాష పట్ల అమర్యాద చూపిస్తున్నట్లేన‌ని సిద్ధ‌రామ‌య్య అన్నారు.

More Telugu News