hindu yuva vahini: ఇదే కొనసాగితే.. 2027 నాటికి ఇస్లాం రాజ్యంగా భారత్: హిందూ యువ వాహిని

  • భారత్ ను ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారు
  • జనాభాను పెంచుకుంటూ పోతున్నారు
  •  హిందూ యువ వాహిని తీవ్ర వ్యాఖ్యలు

భారత్ ను ఇస్లాం రాజ్యంగా మార్చేందుకు ముస్లింలు ప్రయత్నిస్తున్నారంటూ హిందూ యువ వాహిని తీవ్ర ఆరోపణలు చేసింది. దీన్ని సాధించడానికి ముస్లింలు తమ సంతానాన్ని పెంచుకుంటూ పోతున్నారని మండిపడింది. భారత్ ను ఆక్రమించేందుకే జనాభాను పెంచుకుంటూ పోతున్నారంటూ వ్యాఖ్యానించింది. హిందూ యువవాహిని వ్యాఖ్యలతో ఇప్పుడు దుమారం చెలరేగింది.

హిందూ యువవాహిని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు నాగేంద్ర ప్రతాప్ తోమర్ మాట్లాడుతూ, ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కనడం ఆపకపోతే... 2027 కల్లా భారత్ ఇస్లాం రాజ్యంగా మారిపోతుందని అన్నారు. అఖండ భారతావనిని గుప్పిట్లో పెట్టుకోవాలని ముస్లింలు భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ యువ వాహినిని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ 2002లో స్థాపించారు.

More Telugu News