lassi: భ‌ర్త‌పై విష ప్రయోగం చేసిన పాకిస్థాన్ మహిళ.. ఆ పానీయం తాగి భర్త సహా 13 మంది మృతి!

  • మ‌రో 14 మంది ప‌రిస్థితి విష‌మం
  • ముందు భ‌ర్త‌ను మాత్ర‌మే చంపాల‌నుకుని పాల‌ల్లో విషం క‌లిపింది
  • త‌ర్వాత అదే పాల‌ను ల‌స్సీ చేసి అంద‌రికీ ఇచ్చింది

త‌న‌కు ఇష్టం లేని పెళ్లి చేయ‌డంతో భ‌ర్త‌పై కక్ష పెంచుకుని అత‌న్ని చంపాల‌ని ఆసియా బీబీ అనే పాకిస్థానీ మ‌హిళ నిశ్చ‌యించుకుంది. ఇందుకోసం గ‌త‌వారం విషం క‌లిపిన పాలు అత‌నికి ఇచ్చింది. కానీ, అత‌డు ఆ రోజు ఎందుకో ఆ పాలు తాగ‌లేదు. దీంతో ఆమె అత్తగారు ఆ పాలను తోడు పెట్టి పెరుగు చేసి తర్వాత లస్సీ తయారుచేసి కుటుంబసభ్యులకు పంచింది.  

దీంతో విషప్రభావం వల్ల భ‌ర్త‌తో పాటు మ‌రో 12 మంది చ‌నిపోయారు. మ‌రో 14 మంది ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. పాలల్లో బల్లి పడడం వల్ల అవి విషంగా మారి ఉంటాయని మొదట్లో అనుకున్నారు. తర్వాత ఆసియా బీబీ మీద పోలీసులకు అనుమానమొచ్చింది. ఆమెను పిలిచి విచారించగా అసలు నిజం బయటపెట్టింది.

తన ప్రియుడి ప్రోద్బలం, సహకారంతో భర్తను హత్య చేయడానికి తాను ప్రయత్నించినట్లు వెల్లడించింది. వీరిని హ‌త్యానేరం కింద అరెస్టు చేసిన‌ట్లు సీనియ‌ర్ పోలీసు అధికారి ఓవైస్ అహ్మ‌ద్ తెలిపారు. చిన్న‌వ‌య‌సులో పెళ్లి చేయ‌డం, అత్తారింట్లో క‌ష్టాలు, వివాహేత‌ర సంబంధాల కార‌ణంగా పాకిస్థానీ మ‌హిళ‌లు కొన్ని సార్లు ఇలాంటి ఘాతుకాల‌కు పాల్ప‌డుతుంటారు.

More Telugu News