lavanya tripathi: అబ్బే.. ఆ వార్తల్లో నిజం లేదు: హీరోయిన్ లావణ్య త్రిపాఠి

  • లావణ్యకు రూ. 3 కోట్ల జరిమానా
  • తమిళ మీడియాలో వార్తలు
  • అవన్నీ పుకార్లేనన్న లావణ్య

తెలుగులో విజయవంతమైన '100% లవ్' సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా చేస్తానని చెప్పిన లావణ్య త్రిపాఠి, కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఆమె స్థానంలో 'అర్జున్ రెడ్డి' ఫేమ్ శాలిని పాండే నటిస్తోంది. దీంతో లావణ్య వల్ల తాము చాలా నష్టపోయామని... రూ. 3 కోట్ల నష్టపరిహారాన్ని తమకు ఇప్పించాలని నిర్మాతలు అక్కడి కౌన్సిల్ ను కోరినట్టు, ఆ మేరకు ఆమెపై జరిమానా విధించినట్టు తమిళ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.

ఈ వార్తలపై డెహ్రాడూన్ బ్యూటీ లావణ్య స్పందించింది. కోలీవుడ్ నిర్మాతల సంఘం తనపై రూ. 3 కోట్ల జరిమానా విధించినట్టు వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆమె తెలిపింది.

More Telugu News