saho movie: ప్రభాస్ 'సాహో'.. తాజా అప్ డేట్స్!

  • నెక్స్ట్ షెడ్యూల్ యూఏఈలో
  • భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ
  • స్టంట్ కొరియోగ్రఫీ చేస్తున్న కెన్నీ బేట్స్

'బాహుబలి' ఘన విజయం తర్వాత ప్రభాస్ నటిస్తున్న తొలి చిత్రం 'సాహో'. తెలుగుతో పాటు హిందీలో కూడా ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ లుక్ సినీ అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేసింది. మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ యూఏఈకి షిఫ్ట్ అవుతోంది. ఎమిరేట్స్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో ఈ పోరాట సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.

'సాహో'లో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటిస్తుండగా... అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ త్రయం శంకర్-ఎహ్సాన్-లాయ్ సంగీతం అందిస్తున్నారు. 

More Telugu News