revant reddy: రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లంచ్... నేటి షెడ్యూల్ ఇదే!

  • మధ్యాహ్నం 12.30 కి రాహుల్ తో భేటీ
  • సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ లో చేరిక
  • ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాట్లు


మొన్నటి వరకూ తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ గా ఉన్న రేవంత్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న సంగతి తెలిసిందే. నిన్న తన అనుచరులతో సమావేశం అనంతరం ఆయన నేరుగా ఢిల్లీ చేరుకున్నారు. ఇక ఈ ఉదయం తనను కలిసి మద్దతు తెలిపేందుకు వచ్చిన వారితో మాట్లాడుతూ బిజీగా ఉన్నారు.

 ఇక ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు రాహుల్ గాంధీని కలుసుకునే రేవంత్, దాదాపు గంట సేపు ఆయనతోనే గడపనున్నారు. వీలైతే రేవంత్, సోనియా గాంధీని కలిసి ఆమె ఆశీర్వాదం తీసుకుంటారని సమాచారం. రాహుల్ తోనే కలసి ఆయన మధ్యాహ్న భోజనం చేయనున్నారు. ఆపై సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో రాహుల్ సమక్షంలో రేవంత్ మువ్వన్నెల కండువాను కప్పుకోనున్నారు. అనంతరం రాత్రికి హైదరాబాద్ బయలుదేరి రానున్నారు.

More Telugu News