ravula chandrashekhar reddy: 'వస్తావా?' అని భట్టి అడిగితే, 'పనుంది వెళ్లొస్తా' అంటూ టీడీపీ నేత రావుల జంప్!

  • అసెంబ్లీలో ఆసక్తికర సంభాషణ 
  • టీడీఎల్పీకి వచ్చిన రావుల చంద్రశేఖర్ రెడ్డి
  • వెళ్లిపోయేటప్పుడు కాంగ్రెస్ లోకి వస్తావా? అని అడిగిన భట్టి

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ లాబీలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి నడుమ ఓ ఆసక్తికర సంభాషణ జరిగింది. అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయానికి వచ్చిన రావుల, కాసేపు విలేకరులతో మాట్లాడి వెళ్తుండగా, అదే దారిలో భట్టి వచ్చారు.

 రావులను ఉద్దేశించి 'వస్తావా?' (కాంగ్రెస్ పార్టీలోకి) అని అడిగారు. ఆ వెంటనే రావుల 'ఆ... కాస్త పనుంది వెళ్లొస్తా' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక అంతకుముందు రావుల మీడియాతో మాట్లాడుతూ, తన రాజకీయ జీవితమంతా టీడీపీలోనే కొనసాగుతుందని అన్నారు. అసెంబ్లీలో ఉన్న ఓ చెట్టును చూపిస్తూ, ఆ చెట్టు వయసు తనకు తెలియదని, ఎంతో మంది అసెంబ్లీకి వచ్చి వెళుతున్నా, ఆ చెట్టు అలాగే ఉంటుందని, తను కూడా ఆ చెట్టులాంటి వాడినేనని చెప్పారు.

More Telugu News