revant reddy: ఏడు జిల్లాల టీడీపీ అధ్యక్షులు ఖాళీ... రేవంత్ వెంట వెళ్లనున్న వారి పూర్తి జాబితా!

  • తన బలమేమిటో చూపిస్తున్న రేవంత్
  • పదుల సంఖ్యలో నేతలు రేవంత్ వెంటే
  • కొద్దిమందికి టీఆర్ఎస్ నుంచి ఆహ్వానాలు

కాంగ్రెస్ పార్టీలో చేరుతూనే రేవంత్ రెడ్డి తనకున్న బలమేంటో చూపించాడు. తెలంగాణలోని కొత్త జిల్లాల్లో ఏడుగురు జిల్లా స్థాయి అధ్యక్షులతో రాజీనామా చేయించారు. మరో ఆరు జిల్లాల అధ్యక్షులు కూడా నేడో రేపో రాజీనామా చేస్తారని తెలుస్తోంది. మరికొంతమందికి టీఆర్ఎస్ నుంచి ఆహ్వానాలు అందగా, వారు మాత్రమే ప్రస్తుతానికి తాము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతామని అంటున్నారు.

ఇక టీడీపీకి రాజీనామా చేసిన పార్టీల జిల్లా అధ్యక్షుల్లో సుభాష్‌రెడ్డి (కామారెడ్డి), బోడ జనార్దన్‌ (మంచిర్యాల), తోటకూర జంగయ్య యాదవ్‌ (మేడ్చల్‌), కేతావత్‌ బిల్యా నాయక్‌ (నల్లగొండ), పటేల్‌ రమేష్ రెడ్డి (సూర్యాపేట), సీహెచ్‌ విజయ రమణరావు (పెద్దపల్లి), సోయం బాపూరావు (ఆదిలాబాద్‌)లు ఉన్నారు. వీరితో పాటు వరంగల్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి, దొమ్మాటి సాంబయ్యలు ఇప్పటికే రేవంత్ వెంట నడవాలని నిర్ణయించుకోగా, నిజామాబాద్ జిల్లా నుంచి రాజారాం యాదవ్‌, ఖలీంపతి, నీలకంఠరావు పాటిల్‌, నారాయణ, జనార్దన్‌ రెడ్డి, పరవయ్య, ధనంజయ, ఏనుగు మోహన్‌ రెడ్డి, రేఖ, విజయలక్ష్మి, ఖమ్మం జిల్లా నుంచి కంభంపాటి చంద్రశేఖర్‌రావు, ప్రసాద్‌, బానోతు హరిప్రియ, బానోతు హరిసింగ్‌ నాయక్‌, దేవేందర్‌ నాయక్‌, ప్లెంట్‌ రోజ్‌, నల్గొండ జిల్లా నుంచి కంచర్ల భూపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.

More Telugu News