revant reddy: టీపీసీసీ చీఫ్‌ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప‌క్క‌న చిరున‌వ్వులు చిందిస్తూ రేవంత్ రెడ్డి.. సాయంత్రం ఢిల్లీకి ప‌య‌నం

  • త‌న‌ ముఖ్య అనుచ‌రుల‌తో హైద‌రాబాద్‌లో రేవంత్ రెడ్డి సమావేశం
  • టీపీసీసీ అధ్యక్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా హాజ‌రు
  • రేపు రాహుల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డి

త‌న‌ ముఖ్య అనుచ‌రుల‌తో ఈ రోజు హైద‌రాబాద్‌లో రేవంత్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం ఆయ‌న ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. ఈ స‌మావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కూడా హాజ‌ర‌య్యారు. ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప‌క్క‌నే కూర్చున్న రేవంత్ రెడ్డి ఆయ‌న‌తో న‌వ్వుతూ మాట్లాడుతున్నారు. ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స‌మక్షంలో రేపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా క‌ప్పుకోనున్నారు. ఈ భేటీలో పాల్గొన్న ఇత‌ర‌ కాంగ్రెస్ నాయ‌కులు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో మ‌ళ్లీ ప్ర‌జాస్వామ్యాన్ని బ‌ల‌ప‌రుస్తార‌ని వారు వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఒక ఆద‌ర్శ‌వంత‌మైన నాయ‌కుడ‌ని, రాజీనామా చేసి త‌మ పార్టీలోకి వ‌స్తున్నార‌ని కొనియాడారు.  

More Telugu News