revant reddy: ఢిల్లీలోని ఏపీ భవన్ లో రేవంత్ రెడ్డికి గదులు ఇవ్వని అధికారులు!

  • ఈ సాయంత్రం ఢిల్లీకి రానున్న రేవంత్
  • ఆయనతో పాటు పలువురు నేతలు 
  • రేపు ఉదయానికి భారీ సంఖ్యలో అనుచరులు కూడా ఢిల్లీకి
  • గదులు లేవని చెప్పిన ఏపీ, తెలంగాణ అధికారులు

ఢిల్లీలోని ఏపీ భవన్ లో రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులకు గదులు ఇవ్వకుండా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ అధికారులు అడ్డుకున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి, తన అనుచరులతో కలసి ఈ సాయంత్రం ఢిల్లీకి వచ్చి, రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో జరిగే ఈ కార్యక్రమానికి భారీఎత్తున రేవంత్ అనుచరులు హాజరవుతారని అంచనా.

ఇక వారందరికీ బస ఏర్పాట్ల కోసం ఏపీ భవన్ ను సంప్రదించగా, రెండు రాష్ట్రాల అధికారులూ గదులు ఖాళీ లేవని చెప్పినట్టు సమాచారం. ఏపీ భవన్ ప్రస్తుతం రెండు భాగాలుగా ఉండగా, ఓ భాగాన్ని తెలంగాణ సర్కారు, మరో భాగాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News