Virat Kohli: కోహ్లీ సెంచరీ బాదిన వేళ.. మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని.. బయటపడిన భద్రతా లోపాలు!

  • కోహ్లీని అభినందించేందుకు మైదానంలోకి చొచ్చుకొచ్చిన అభిమాని
  • అడ్డుకున్న అంపైర్.. ఆటకు అంతరాయం
  • నిర్బంధించి పోలీసులకు అప్పగింత

కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన చివరి వన్డేలో టీమిండియా సారథి కోహ్లీ సెంచరీ బాదిన వేళ మైదానంలో భద్రతా లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. కోహ్లీ వన్డేలో 32వ సెంచరీ చేసి ప్రేక్షకులకు అభివాదం చేస్తుండగా, అతడిని అభినందించేందుకు అభిమాని ఒకరు ఒక్కుదుటున మైదానంలోని కోహ్లీ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కోహ్లీ పేరుతో ఉన్న జెర్సీని ధరించిన అతడు కోహ్లీ వైపుగా పరిగెత్తుకుంటూ వస్తుండడంతో ఏం జరుగుతుందో కాసేపు ఎవరికీ అర్థం కాలేదు.

ఆ వెంటనే స్క్వేర్-లెగ్ వద్ద ఉన్న అంపైర్ అతడిని అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు కొంతసేపు అంతరాయం కలిగింది. అభిమానిని అదుపులోకి తీసుకుని స్టేడియం భద్రతా సిబ్బంది అతడిని స్థానిక పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆట తిరిగి ప్రారంభమైంది. గతంలో ఇదే మైదానంలో ఇటువంటి ఘటనే జరిగింది. ఐపీఎల్‌లో భాగంగా గుజరాత్-ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా ఇలాగే అభిమాని ఒకరు గ్రౌండ్‌లోకి చొచ్చుకొచ్చాడు. 

More Telugu News