revant reddy: రేపు విజ‌య‌వాడ‌కు రండి.. అక్కడ కూలంకుషంగా చ‌ర్చించుకుందాం!: టీటీడీపీ నేతలతో చ‌ంద్ర‌బాబు

  • హైద‌రాబాద్‌లోని లేక్ వ్యూ అతిథి గృహంలో ముగిసిన భేటీ
  • విజ‌య‌వాడ‌కు బ‌య‌లుదేరిన చంద్రబాబు

ఈ రోజు హైద‌రాబాద్‌లోని లేక్ వ్యూ అతిథి గృహంలో టీడీపీ జాతీయాధ్య‌క్షుడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి ఆధ్వ‌ర్యంలో జరిగిన టీటీడీపీ నేతల స‌మావేశం అసంపూర్తిగా ముగిసిన విష‌యం తెలిసిందే. ఈ స‌మావేశం అనంత‌రం చంద్ర‌బాబు విజ‌య‌వాడ బ‌య‌లుదేరారు. రేపు టీటీడీపీ నేత‌ల‌ను విజ‌య‌వాడకు రావాల‌ని చంద్ర‌బాబు కోరారు. విజ‌య‌వాడ‌లో కూలంకుషంగా చ‌ర్చించుకుందామ‌ని వారికి సూచించారు. టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారంపై రేపు చంద్ర‌బాబు ఓ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.  

More Telugu News