hottest chip: ప్ర‌పంచంలో అత్యంత ఘాటైన చిప్స్‌... తిన‌డానికి ప్ర‌య‌త్నించి, ఆపసోపాలు పడ్డ న్యూస్ యాంక‌ర్‌... వీడియో చూడండి!

  • `ఒక్క చిప్ తిన‌గ‌ల‌రా?` అంటూ ఛాలెంజ్‌
  • లైవ్ షోలో ప్ర‌య‌త్నించిన టీవీ యాంక‌ర్లు
  • తిన‌లేక ఇబ్బందులు

ఆలూ చిప్స్ మార్కెట్లోకి వ‌చ్చిన‌ కొత్తలో...`మీరు ఒక్క చిప్ తింటే చాలు... ప్యాకెట్ మొత్తం ఖాళీ చేస్తారు` అంటూ ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చేవి. కానీ అమెరికాలోని పాఖీ అనే కంపెనీ మాత్రం... `మీరు ఒక్క చిప్ పూర్తిగా తిన‌గ‌లిగితే గ్రేట్‌!` అంటూ ప్ర‌చారం చేస్తోంది. ప్ర‌పంచంలో అత్యంత ఘాటైన ఈ చిప్ తింటే దాని ఘాటు త‌ట్టుకోలేక‌ ఎక్కిళ్లు రావ‌డం, క‌ళ్లు తిర‌గ‌డం, త‌ల మొత్తం మంట‌లు రావ‌డం గ్యారంటీ అంటూ ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. `వ‌న్ చిప్ ఛాలెంజ్‌` పేరుతో దీని అమ్మ‌కాలు ప్రారంభించారు.

అయితే ఇదంతా చిప్ అమ్మ‌కాల కోసం చేస్తున్న ప్ర‌చార గిమ్మిక్కుగా భావించి, డెన్వ‌ర్‌లోని కేడ‌బ్ల్యూజీఎన్ న్యూస్ ఛాన‌ల్ యాంక‌ర్లు లైవ్‌లో తిన‌డానికి ప్ర‌య‌త్నించారు. ఈ చిప్‌ను తిన‌డానికి ముందు ప్ర‌చార ప్ర‌క‌ట‌న‌ను ప్ర‌సారం చేసి న్యూస్ ఛాన‌ల్‌కి చెందిన ఆ న‌లుగురు యాంక‌ర్లు న‌వ్వుకున్నారు. అయితే తిన్న త‌ర్వాత వారు ప‌డిన బాధ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా వారిలో మ‌హిళా యాంక‌ర్ ఏం చేయాలో అర్థం కాక న్యూస్ బెంచ్ కింద‌కి వెళ్లిపోయింది. వైర‌ల్‌గా మారిన‌ ఈ వీడియోలో ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్స్ హైలైట్‌గా నిలిచాయి.

More Telugu News