క్రికెట్ : చివ‌రి వ‌న్డేలో మాదే విజ‌యం: న‌్యూజిలాండ్ ఆట‌గాడి ధీమా

  • నిన్న‌టి ఓటమి కొద్దిగా నిరాశకు గురి చేసింది: స్పిన్న‌ర్ మిచెల్ సాంత్నార్
  • టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించి ఒత్తిడిలోకి నెట్టేశారు
  • ఈ వన్డేలో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం

టీమిండియాతో జరుగుతోన్న వన్డే సిరీస్‌లో మొద‌టి వ‌న్డే గెలిచి రెండో వ‌న్డేలో ఓడిన న్యూజిలాండ్.. ఫైన‌ల్ మ్యాచ్‌లో గెల‌వాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది. తాజాగా ఆ జ‌ట్టు స్పిన్న‌ర్ మిచెల్ సాంత్నార్ మీడియాతో మాట్లాడుతూ... నిన్న‌టి ఓటమి నిరాశకు గురి చేసిందని అన్నాడు. రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించి త‌మ‌ని ఒత్తిడిలోకి నెట్టేశారని చెప్పాడు.

తొలి పది ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోవడం తమను తేరుకోనీయకుండా చేసిందని మిచెల్ సాంత్నార్ వ్యాఖ్యానించాడు. ఈ వన్డేలో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకున్నామని చెప్పాడు. కాన్పూర్‌లో జ‌రిగే చివ‌రి వన్డేకు సిద్ధమవుతున్నామ‌ని, ఆ వ‌న్డేలో గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశాడు.  

More Telugu News