vizag port: వైజాగ్ పోర్ట్ కు చేరిన 'సముద్ర బాహుబలి'!

  • ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నౌక లైబీరియాకు చెందిన సీఎంఏ సీజీఎం వెర్డీ
  • 277 మీటర్ల పొడవు కలిగిన నౌక
  • ఒకేసారి 65,000 టన్నుల సరకు రవాణా

విశాఖపట్టణం పోర్ట్ ట్రస్ట్ కు సముద్ర బాహుబలిగా పేరొందిన సీఎంఏ సీజీఎం వెర్డీ నౌక సరకు తీసుకుని వచ్చింది. లైబీరియాకు చెందిన ఈ నౌక ప్రపంచంలోనే రెండో అతిపెద్దనౌక కావడం విశేషం. 2004 నుంచి సేవలందిస్తున్న ఈ నౌక 277 మీటర్ల పొడవు కలిగి ఉంటుంది. ఇందులో ఒకేసారి 65,000 టన్నుల సరకును రవాణా చేయవచ్చు. వైజాగ్ పోర్ట్ లోని కంటైనర్‌ టెర్మినల్‌ లోని పోర్టు బెర్త్‌ లో దీనిని నిలిపి సరకు ఎగుమతి, దిగుమతి చేశారు. కాగా, ఈ నౌక విశాఖ తీరానికి రావడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. 

More Telugu News