electron: ఎలక్ట్రానిక్‌ షోరూమ్‌లో కుంభకోణం... టీవీలు అమ్ముకున్న ఉద్యోగులు

  • విజ‌య‌వాడ‌లో పేరొందిన ఓ ఎలక్ట్రానిక్‌ షోరూమ్‌లో ఘటన
  • కోటి రూపాయల మేర మోసం
  • ఐదుగురిపై కేసు న‌మోదు

విజ‌య‌వాడ‌లో పేరొందిన ఓ ఎలక్ట్రానిక్‌ షోరూమ్‌లో భారీ కుంభకోణం బ‌య‌ట‌ప‌డింది. టీవీ షోరూంలో ప‌నిచేస్తోన్న‌ ఉద్యోగులు కోటి రూపాయల మేర మోసానికి పాల్ప‌డ్డారు. ఈ విష‌యాన్ని గుర్తించిన స‌ద‌రు కంపెనీ యాజ‌మాన్యం వారిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ కుంభ‌కోణంలో షోరూం మేనేజర్‌తో పాటు సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బంద‌రు రోడ్డులో ఉన్న ఆ కంపెనీకి చెందిన షోరూంలో ఎల్‌ఈడీ టీవీలు, ఇతర ఉత్పత్తులను షోరూమ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు కొట్టేసి వాటిని అమ్ముకున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం ఐదుగురిపై కేసు న‌మోదు అయింద‌ని స‌మాచారం. ఈ కేసులో పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

More Telugu News