prathyusha: మా అమ్మాయిని రవిరాజా పినిశెట్టి చెంపదెబ్బ కొట్టారు .. పెద్దగా ఏడ్చేసింది!: ప్రత్యూష తల్లి సరోజినీ దేవి

  • 'రాయుడు' మూవీలో మోహన్ బాబు కూతురు పాత్రలో ప్రత్యూష
  • అప్పటికి ప్రత్యూషకి నటన కొత్త 
  • షూటింగ్ వాతావరణం గంభీరంగా ఉండటంతో భయపడిపోయేది
  •  మోహన్ బాబు గారు సముదాయించారు  

         

నటిగా ఎదుగుతోన్న సమయంలోనే అర్ధాంతరంగా ప్రత్యూష చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రత్యూషకి సంబంధించిన విషయాలను ఆమె తల్లి సరోజినీదేవి తాజాగా తెలుగు పాప్యులర్ టీవీతో పంచుకున్నారు. 'రాయుడు' సినిమా షూటింగులో జరిగిన ఒక సంఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు.

" 'రాయుడు' సినిమా అప్పటికీ ప్రత్యూష వయసు 16 యేళ్లు .. నటన కొత్త. ఆ సినిమాలో మోహన్ బాబు కూతురు 'మేనక' పాత్రలో ప్రత్యూష చేసింది. షూటింగులో వాతావరణం గంభీరంగా ఉండటంతో ప్రత్యూష భయపడిపోయేది. దాంతో ఒక సీన్ చేయడానికి నాలుగైదు టేకులు తీసుకుంది. దాంతో దర్శకుడు రవిరాజా పినిశెట్టికి కోపం వచ్చేసి .. చెబుతుంటే నీకు అర్థం కావడం లేదా .. నీ కోసం మోహన్ బాబు ఎన్నిసార్లు చేస్తారు? అంటూ గట్టిగా చెంప మీద ఒక దెబ్బ కొట్టారు. పెద్దగా ఏడ్చేసిన ప్రత్యూష .. ఆ షాట్ పూర్తయిన తరువాత ఇంటికి వెళ్లిపోదామంటూ పట్టుబట్టింది. దాంతో మోహన్ బాబు గారు వచ్చి నచ్చజెప్పారు .. ఆ సీన్ ఆమెకు మంచి పేరు తీసుకువస్తుందంటూ సముదాయించారు" అంటూ చెప్పుకొచ్చారు.         

More Telugu News