vodafone: వోడాఫోన్ ఆఫీసులో లైంగిక వేధింపులు... పట్టించుకోనందుకు జరిమానా!

  • రూ. 50 వేల జరిమానా విధించిన బాంబే హైకోర్టు
  • జరిమానాను వార్ విడోస్ అసోసియేషన్ కు చెల్లించండి
  • తీర్పిచ్చిన న్యాయమూర్తులు

వోడాఫోన్ ఎస్సార్ (ప్రస్తుతం వోడాఫోన్) కంపెనీలో లైంగిక వేధింపులు జరుగుతూ ఉంటే యాజమాన్యం పట్టించుకోలేదని నిర్ధారించిన బాంబే హైకోర్టు రూ. 50 వేల జరిమానాను విధించింది. కంపెనీల్లో అంతర్గత ఫిర్యాదుల పరిష్కారానికి 'విశాక విధివిధానాల ప్రకారం' కమిటీని నియమించని వోడాఫోన్ పై ఈ జరిమానాను విధిస్తున్నామని, ఈ డబ్బు 'వార్ విడోస్ అసోసియేషన్'కు జమ చేయాలని న్యాయమూర్తులు అమ్జాద్ సయ్యద్, ఎంఎస్ కార్నిక్ లతో కూడిన బెంచ్ తీర్పిచ్చింది.

ఓ మాజీ ఉద్యోగిని వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు, ఆమెను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వేధించాడని, తనకు సహకరించాలని ఒత్తిడి తెచ్చాడని కోర్టు విశ్వసిస్తున్నట్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఫిర్యాదు చేయాలన్నా, విషయం ఎవరికైనా చెప్పుకోవాలన్నా తనకు మార్గం లేకపోయిందని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించిన ఆమె పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు జరుగగా, తప్పు వోడాఫోన్ దేనని తీర్పు వెలువడింది.

More Telugu News