ఎమ్మెల్యే చింతమనేని: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదు!

  • ‘ఇంటింటికి టీడీపీ’లో సమస్యలు విన్నవించుకుంటే దౌర్జన్యం చేశారని ఆరోపణ
  • దెందులూరు పోలీస్ స్టేషన్ లో ఇటీవల ఫిర్యాదు చేసిన బాధితులు
  • ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై కేసు నమోదు 

మహిళలు, చిన్నారులపై దౌర్జన్యం చేసిన విషయంలో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల క్రితం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి శివారు లింగారావుగూడెంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డ్రైనేజ్, రోడ్డు సమస్యలను పరిష్కరించమని స్థానికులు విన్నవించుకున్నారు. తమ సమస్యలు విన్నవించుకుంటే మహిళలు, చిన్నారులపై ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దౌర్జన్యం చేశారని బాధితులు ఆరోపిస్తూ దెందులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని ఆ ఫిర్యాదులో బాధితులు డిమాండ్ చేశారు.

More Telugu News