శ్రీధర్ బాబు: శ్రీధర్ బాబుపై ప్రభుత్వం కుట్ర పూరితంగా కేసు పెట్టింది: టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్

  • కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై పోరాడుతున్న శ్రీధర్ బాబు  
  • అధికార పార్టీ వారికి కమీషన్లు రావనే భయంతో కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు 
  • మండిపడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్రీధర్ బాబుపై ప్రభుత్వం కుట్ర పూరితంగా కేసు పెట్టిందని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై శ్రీధర్ బాబు పోరాటం చేస్తుండటంతో తమకు కమీషన్లు రావనే భయంతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. జేఏసీ నేత కోదండరామ్, కాంగ్రెస్, లెఫ్ట్, ప్రజా సంఘాలపై ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

More Telugu News