పాకిస్థాన్‌ జర్నలిస్ట్: పాక్ జర్నలిస్టుతో ప్రేమా? స్నేహమా?: పంజాబ్ ముఖ్య‌మంత్రిపై విమర్శలు

  • పాకిస్థాన్‌ జర్నలిస్ట్ అరూసాతో పంజాబ్ ముఖ్య‌మంత్రి అమరీందర్ సింగ్‌ సెల్ఫీ
  • విమర్శలు చేస్తోన్న ప్రతిపక్ష పార్టీల నేతలు
  • త‌మ మ‌ధ్య ప్రేమ లేద‌ని, స్నేహితులం మాత్రమేనని గతంలో స్పష్టం చేసిన పాక్ జర్నలిస్టు

పాకిస్థాన్‌ జర్నలిస్ట్ అరూసాతో పంజాబ్ ముఖ్య‌మంత్రి అమరీందర్ సింగ్‌ స్నేహాన్ని కొన‌సాగిస్తుండ‌డం ప‌ట్ల విమ‌ర్శ‌లు వ‌స్తోన్న వేళ బ‌య‌ట‌ప‌డిన ఓ ఫొటో మ‌రింత అల‌జ‌డి రేపుతోంది. ఇటీవల అమ‌రీంద‌ర్ సింగ్ కారులో వెళుతుండ‌గా.. త‌న‌ వెనుక సీట్లో కూర్చున్న అరూసాతో ఆయ‌న సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్ఫీతో వారి బంధం మరోసారి బ‌య‌ట‌ప‌డింద‌ని ప్రతిపక్ష పార్టీల నేత‌లు విమర్శలు చేస్తున్నారు. ఈ సెల్ఫీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌డంతో అమరీందర్ సింగ్.. పాక్ జ‌ర్నలిస్టుతో సంబంధంపై మ‌రోసారి అభాసు పాలవుతున్నారు.
 
త‌న‌కు అమ‌రీంద‌ర్ సింగ్‌తో సంబంధాలు ఉన్నాయ‌ని వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌ను గ‌తంలో చంఢీగఢ్‌లో జరిగిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అరూసా ఖండించారు. త‌మ మ‌ధ్య ప్రేమ లేద‌ని, స్నేహితులం మాత్రమేనని ఆమె అన్నారు. త‌మ‌ స్నేహం ఎప్ప‌టికీ కొనసాగుతుంద‌ని చెప్పారు. అమ‌రీంద‌ర్ సింగ్ ముఖ్య‌మంత్రి అయిన త‌రువాత ప‌లు ముఖ్య కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న‌తో క‌లిసి ఆమె క‌నిపించారు. 

More Telugu News