earth quake: హైదరాబాదులో మరిన్ని భూప్రకంపనలు వచ్చే అవకాశం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎన్జీఆర్ఐ

  • జోన్-2 పరిధిలో హైదరాబాద్
  • శుక్రవారం నుంచి 20కి పైగా ప్రకంపనలు
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాదులోని బోరబండ ప్రాంతంలో సంభవించిన భూప్రకంపనలపై నేషనల్ జియోఫిజికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) అధ్యయనాన్ని మొదలుపెట్టింది. బోరబండ, రహ్మత్ నగర్ సహా నాలుగు ప్రాంతాల్లో భూకంప పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఎన్జీఆర్ఐ సీనియర్ సైంటిస్ట్ శ్రీనగేష్ మాట్లాడుతూ, శుక్రవారం రాత్రి నుంచి 20కి పైగా భూప్రకంపనలను గుర్తించామని తెలిపారు. మరిన్ని భూప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జోన్-2 పరిధిలో హైదరాబాద్ ఉందని... ఇక్కడ మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉందని చెప్పారు.

More Telugu News