fire: తమిళనాడులో దారుణం.. కలెక్టర్ ఆఫీసు వ‌ద్ద కూతుళ్లతో పాటు నిప్పంటించుకున్న తల్లిదండ్రులు

  • తిరునెల్వేలిలో ఘటన
  • పరిస్థితి విషమం
  • త‌మ స‌మ‌స్య గురించి కలెక్టర్‌కు ఎన్నిసార్లు చెప్పుకున్నా రాని స్పందన

త‌మ కూతుళ్ల‌తో పాటు త‌ల్లిదండ్రులు కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డ ఘ‌ట‌న తమిళనాడులోని తిరునెల్వేలి కలెక్టర్ ఆఫీసు ప్రాంగణంలో చోటు చేసుకుంది. త‌మ స‌మ‌స్య గురించి కలెక్టర్‌కు ఎన్నిసార్లు చెప్పుకున్నా వినిపించుకోక‌పోవ‌డంతో వారు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. నిప్పంటించుకున్న ఆ కుటుంబాన్ని స్థానికులు, పోలీసులు కాపాడారు. వెంటనే మంటలను ఆర్పేసి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే, ఆ కుటుంబ స‌భ్యుల‌ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన వారు ఇసక్కిముత్తు, ఆయన భార్య సుబ్బలక్ష్మి, వారి కూతుళ్లు మదు శరణ్య, అక్షయ పూర్ణిమగా పోలీసులు గుర్తించారు. 

More Telugu News