anupama: రాజమౌళి మూవీలోగానీ .. చిరూ సినిమాలో గాని చిన్న సీన్ అయినా చేయాలనుంది : అనుపమ పరమేశ్వరన్

  • యువ కథానాయికలలో అనుపమ పరమేశ్వరన్ కి క్రేజ్ 
  • వరుసగా పలకరిస్తోన్న సక్సెస్ లు 
  • తాజా చిత్రంగా 'ఉన్నది ఒకటే జిందగీ'
  • మనసులో మాట చెప్పిన అనుపమ        

తెలుగు తెరకి పరిచయమవుతూనే లక్కీ హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ మంచి మార్కులు కొట్టేసింది. వరుస విజయాలను సాధిస్తూ వెళుతోన్న ఆమె, ఈ నెల 27వ తేదీన 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో అనుపమ మాట్లాడుతూ, రాజమౌళి సినిమాలో ఒక్క సీన్ అయినా చేయాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది.

ఆ తరువాత ఆమె చిరంజీవి గురించి ప్రస్తావించింది. "ఆ మధ్య ఖైదీ నెంబర్ 150' చూశాను. చిరంజీవి ఈ వయసులో ఆ స్థాయిలో డాన్స్ చేయడం .. ఫైట్స్ చేయడం చూసి షాక్ అయ్యాను. ఆయన సినిమాలో ఒక నిమిషం నిడివి గల పాత్ర కోసం పిలుపొచ్చినా వెంటనే వెళతాను" అంటూ చెప్పుకొచ్చింది. రాజమౌళి .. చిరూ సినిమాల్లో చేయాలనే అమ్మడి కోరిక ఎప్పటికి నెరవేరుతుందో .. ఏమో!      

More Telugu News