mp daughter: హైదరాబాద్ మాల్ లో టీడీపీ ఎల్పీ కార్యదర్శి సురేష్ పై తెరాస ఎంపీ కూతురి దాడి!

  • షాపింగ్ కు వెళ్లిన సురేష్ దంపతులు
  • దాడికి దిగిన యువతి
  • నానా హంగామా చేస్తూ బెదిరింపులు
  • రంగంలోకి దిగిన పోలీసులు, విచారణ మొదలు

తాను అధికార పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడి కుమార్తెనని చెబుతూ, ఏపీ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం కార్యాలయం కార్యదర్శి సురేష్‌ (50), ఆయన భార్య భాను (44)లపై హైదరాబాద్, బంజారాహిల్స్‌, రోడ్ నెంబర్ 1లో ఉన్న సిటీ సెంటర్‌ మాల్‌ లో ఓ యువతి దాడికి దిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, మాల్ లోని సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, సురేష్, భాను దంపతులు షాపింగ్ నిమిత్తం సిటీ సెంటర్‌ మాల్‌ కు వచ్చారు. గబగబా వస్తున్న ఓ యువతి వీరిని ఢీకొట్టి లిఫ్ట్‌ లోకి ప్రవేశించింది. అంతటితో ఊరుకోకుండా, కళ్లు కనిపించట్లేదా? అంటూ రెచ్చిపోయింది. సెక్యూరిటీ గార్డులు, షాపింగ్ కు వచ్చిన ఇతర కస్టమర్లు వారిస్తున్నా వినలేదు. తాను ఎంపీ కూతురినని, గన్‌ మెన్‌ లను పిలుస్తున్నానని, కాల్చేస్తానని నానా హంగామా చేసింది.

బాధితులు భయంతో వెళ్లిపోతుంటే, వారిని మరోసారి కారు దగ్గర అటకాయించి దాడికి దిగింది. చివరికి సెక్యూరిటీ గార్డుల సాయంతో వారిద్దరూ తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. ఆమె వేసుకు వచ్చిన లగ్జరీ కారు నెంబర్ ను నోట్ చేసుకున్న బాధితులు దాన్ని పోలీసులకు ఇవ్వడంతో, కారు ఎవరిదన్న విషయాన్ని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

More Telugu News