న్యూజిలాండ్: విజయలక్ష్యానికి చేరువగా న్యూజిలాండ్ జట్టు!

  • క్రీజ్ లో టేలర్ , లాంథమ్  
  • స్కోరు బోర్డును పరుగెత్తిస్తున్న వైనం
  • విజయలక్ష్యాన్ని అందుకోనున్న కివీస్ జట్టు

తొలి వన్డేలో విజయలక్ష్యానికి చేరువగా న్యూజిలాండ్ జట్టు పయనిస్తోంది. వాంఖడే వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 280 పరుగులు చేసింది. 281 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ఆ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించనుంది.

45 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు 251 పరుగులు చేసింది. టేలర్, లాథమ్ ల భాగస్వామ్యం నిలకడగా కొనసాగుతోంది. టేలర్ 80 పరుగులతో, లాంథమ్ 91 పరుగులతో స్కోర్ బోర్డును ముందుకు తీసుకువెళుతున్నారు.

More Telugu News