వాంఖడే: తొలి వన్డే: మొదటి వికెట్ కోల్పోయిన టీమిండియా

  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
  • నాల్గో ఓవర్ లో శిఖర్ ధావన్ అవుట్
  • 200వ వన్డే మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ

ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా మొదటి వికెట్ కోల్పోయింది. నాల్గో ఓవర్ లో బౌల్ట్ బౌలింగ్ లో ఓపెనర్ శిఖర్ ధావన్ (9) లాథమ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నాలుగు ఓవర్లు పూర్తయ్యే సరికి భారత్‌ ఒక వికెట్‌ నష్టపోయి 16 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్‌ శర్మ(7), కోహ్లీ ఉన్నారు. కెప్టెన్‌ కోహ్లీకి ఇది 200వ వన్డే. కాగా, టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 

More Telugu News