Disha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • 'సంఘమిత్ర'లో నాయికగా దిశా పటానీ 
  • నవంబర్ 3న హెబ్బా పటేల్ 'ఏంజెల్' 
  • తెలుగులో రీమేక్ కానున్న తమిళ హిట్ చిత్రం 
  • విజయ్ 'అదిరింది' ఈ నెల 26న  

*  తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్టుతో రూపొందే 'సంఘమిత్ర' చిత్రంలో కథానాయికగా పలువురు పేర్లను పరిశీలించి, చివరికి దిశా పటానీని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా దిశా చాలా ఆనందంతో ట్వీట్ చేసింది. ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొంది. దీనికి ఖుష్బూ భర్త సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నాడు.
*  నాగ అన్వేశ్, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన 'ఏంజెల్' చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని వచ్చే నెల 3న విడుదల కానుంది. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి బాహుబలి పళని దర్శకత్వం వహించాడు.
*  విజయ్ సేతుపతి, మాధవన్ కీలక పాత్రలు పోషించిన సూపర్ హిట్ తమిళ చిత్రం 'విక్రం వేద'ను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు. తమిళ వెర్షన్ ను నిర్మించిన వై నాట్ స్టూడియోస్ దీనిని తెలుగులో కూడా నిర్మించనుంది. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.
*  విజయ్ హీరోగా రూపొందిన 'మెర్సల్' చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయాన్ని సాధించింది. కాగా, ఈ చిత్రం తెలుగు అనువాదం 'అదిరింది'ని ఈ నెల 26న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇందులో కాజల్, సమంతా, నిత్యా మీనన్ హీరోయిన్లుగా నటించారు. 

More Telugu News