yogi adityanath: భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టిన యూపీ ముఖ్యమంత్రి యోగి!

  • స్వాతంత్ర్య సమరయోధుల కార్యక్రమంలో పాల్గొన్న యోగి
  • ఉద్వేగానికి లోనై కంటతడి పెట్టిన వైనం 
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో, వీడియో

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర భావోద్వేగానికి లోనై, కంటతడి పెట్టారు. దీపావళి సందర్భంగా గోరఖ్ పూర్ లో నిర్వహించిన 'ఏక్ దియా - షాహీదోంకే నామ్' (వీరుల పేరిట ఓ దీపం) కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. స్వాతంత్ర్య సమరయోధులను గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. కళ్ల నుంచి నీరు జలజలా రాలింది. ఉబికి వస్తున్న నీటిని ఆయన పలుమార్లు తుడుచుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో, వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్యక్రమం అనంతరం చిన్నపిల్లలకు స్వీట్లు, పండ్లు, పాఠ్యపుస్తకాలను ముఖ్యమంత్రి పంచిపెట్టారు.

More Telugu News