earth quake: హైదరాబాదులో స్వల్ప భూప్రకంపనలు

  • యూసుఫ్ గూడ-బోరబండ మధ్య కంపించిన భూమి
  • తెల్లవారుజామున ప్రకంపనలు
  • వివరాలను సేకరించిన అధికారులు

హైదరాబాదులో ఈ తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ నుంచి బోరబండ వైపు వెళ్లే మార్గంలో ఉన్న ప్రాంతాల్లో భూమి కంపించింది. రహ్మత్ నగర్ డివిజన్ లోని ఇందిరానగర్, ప్రతిభానగర్, హెచ్ఎఫ్ నగర్ ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించిందని... తెల్లవారుజామున 3 నుంచి 3.30 గంటల సమయంలో ఇది చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. భూమి కంపించిన ప్రాంతాల్లో ఎమ్మార్వో సైదులు, కార్పొరేటర్ షఫీ పర్యటించి స్థానికుల నుంచి వివరాలను సేకరించారు. ఈ భూప్రకంపనల వల్ల ఎవరికీ, ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. 

More Telugu News