chandrababu: దుబాయ్ రాజుతో భేటీ కానున్న చంద్రబాబు

  • ముగిసిన అమెరికా పర్యటన
  • దుబాయ్ చేరుకున్న సీఎం
  • ప్రవాసాంధ్రులతో భేటీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా పర్యటన ముగిసింది. మూడు రోజుల అమెరికా పర్యటనను ముగించుకున్న ఆయన దుబాయ్ వెళ్లారు. ఈరోజు, రేపు ఆయన దుబాయ్ లో పర్యటించనున్నారు. ఈ రోజు దుబాయ్ లో ఉన్న భారతీయ పాఠశాలలో ఆయన ప్రవాసాంధ్రులతో భేటీ కానున్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి  పనులను, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా వారికి వివరించనున్నారు. మరోవైపు, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ తో కూడా ఆయన భేటీ కానున్నారు. 

More Telugu News