siddharth: చైతూ పాత్రను నేను చేయాల్సింది .. అలా మిస్ అయింది : సిద్ధార్థ్

  • 'మనం' సినిమా గురించి సిద్ధార్థ్ ప్రస్తావన 
  • విక్రమ్ కుమార్ ముందుగా అలా భావించారు 
  • ఆ తరువాత అలా జరిగింది        

తెలుగు .. తమిళ భాషల్లో సిద్ధార్థ్ కి మంచి క్రేజ్ వుంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ రెండు భాషల్లోను ఆయనకి అవకాశాలు తగ్గాయి. దాంతో ఈ రెండు భాషల్లోను తనే నిర్మాతగా .. హీరోగా ఆయన ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ఆ మధ్య తెలుగులో వచ్చిన 'మనం' సినిమాను గురించి ఆయన ప్రస్తావించాడు.

 ఈ కథ కోసం విక్రమ్ కుమార్ ముందుగా తననీ .. కె. విశ్వనాథ్ ను .. వెంకటేశ్ ను అనుకున్నారని చెప్పాడు. అయితే ఆ తరువాత ఆయన ఈ కథను అక్కినేని ఫ్యామిలీ దగ్గరికి తీసుకెళ్లారని అన్నాడు. అందువలన ఈ సినిమాలో తాను చేయవలసిన పాత్రను మిస్సయ్యానని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా వచ్చిన చాలాకాలం తరువాత సిద్ధార్థ్ ఈ విషయాన్ని గురించి ప్రస్తావించడమే ఆశ్చర్యాన్ని కలిగించే విషయం.          

More Telugu News