Kajal: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

  • 'భోగన్' రీమేక్ లో నాయికగా కాజల్ 
  • తాజా షెడ్యూలు పూర్తి చేసిన నిఖిల్ 
  • పునర్జన్మల నేపథ్యంలో పూరీ 'మెహబూబా' 
  • ఎన్టీఆర్ బయోపిక్ కి కీరవాణి సంగీతం

*  తమిళంలో హిట్టయిన 'భోగన్' చిత్రాన్ని రవితేజ హీరోగా తెలుగులో రీమేక్ చేయనున్నారు. తమిళ ఒరిజినల్ కి దర్శకత్వం వహించిన లక్ష్మణ్ దీనికి కూడా దర్శకత్వం వహిస్తాడు. ఇక ఇందులో కథానాయికగా కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసినట్టు తాజా సమాచారం.  
*  కన్నడలో హిట్టయిన 'కిరిక్ పార్టీ' చిత్రాన్ని నిఖిల్ హీరోగా శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూలు ఉత్తరాఖండ్ పరిసర ప్రాంతాలలో నిర్వహించారు. సంయుక్త హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి యువ దర్శకులు సుధీర్ వర్మ, చందు మొండేటి కలసి స్క్రీన్ ప్లే, సంభాషణలు సమకూర్చడం విశేషం.
*  ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తన తదుపరి చిత్రాన్ని 'మెహబూబా' పేరిట తన తనయుడు ఆకాష్ తో చేస్తున్న సంగతి విదితమే. ఈ చిత్ర కథ నేపథ్యం తాజాగా రివీల్ అయింది. ఇండో-పాక్ విభజన కాలం నాటి హీరో హీరోయిన్లు.. మళ్లీ ఆ దేశ సరిహద్దు గ్రామాల్లో పునర్జన్మను పొందే నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోందట.
*  తేజ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడుగా దివంగత ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి విదితమే. ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన మరో విశేషం వెల్లడైంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి దీనికి సంగీతాన్ని అందిస్తారట.  

More Telugu News