anupama: అనుపమ పరమేశ్వరన్ పాత్ర అలాంటిది .. కట్టిపడేస్తుందంతే!: కిషోర్ తిరుమల

  • కిషోర్ తిరుమల దర్శకుడిగా 'ఉన్నది ఒకటే జిందగీ'
  • రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ 
  • డిఫరెంట్ లుక్ తో రామ్  
  • ఈ నెల 27న విడుదల

'నేను శైలజ' సినిమాతో రామ్ కి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కిషోర్ తిరుమల, మళ్లీ రామ్ తోనే 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాను తెరకెక్కించాడు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి కిషోర్ తిరుమల మాట్లాడారు. స్నేహం .. ప్రేమ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని చెప్పారు.

రామ్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడనీ .. ఆయన పాత్ర చాలా సరదాగా ఉంటుందని అన్నారు. ఇక అనుపమ పరమేశ్వరన్ కట్టిపడేస్తుందనీ .. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెప్పారు. తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రామ్ .. అనుపమ కాంబినేషన్లో వచ్చే సీన్స్ మంత్రముగ్ధులను చేస్తాయని అన్నారు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఈ సినిమా ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  

More Telugu News