revanth reddy: టీ-టీడీపీని రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టించాడు... వెంటనే సస్పెండ్ చేయండి: మోత్కుపల్లి

  • టీ-టీడీపీని రేవంత్ నాశనం చేశారు
  • టీడీపీ ఆఫీసు మెట్లు ఎక్కే అర్హత కూడా లేదు 
  • ఓటుకు నోటు వ్యవహారంతో పార్టీని భ్రష్టు పట్టించారు


రేవంత్ రెడ్డి వ్యవహారం టీ-టీడీపీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. రేవంత్ రెడ్డిపై టీ-టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి మండిపడ్డారు. టీడీపీ ఆఫీసు మెట్లు ఎక్కే అర్హత కూడా రేవంత్ కు లేదని అన్నారు. పార్టీ సమావేశానికి రేవంత్ ఎలా వస్తారని ప్రశ్నించారు. టీ-టీడీపీని రేవంత్ నాశనం చేశారని... ఓటుకు నోటు కేసుతో పార్టీ పరువును నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  

More Telugu News