srinivas reddy: మరోసారి హీరోగా మారుతోన్న కమెడియన్!

  • కమెడియన్ గా శ్రీనివాస్ రెడ్డికి మంచి పేరు 
  • అప్పుడప్పుడు హీరోగా ప్రయత్నాలు 
  • 'మను' దర్శకుడిగా రొమాంటిక్ కామెడీ

అలీ ..  బ్రహ్మానందం వంటి హాస్య నటులు ఒక వైపున కమెడియన్స్ గా కొనసాగుతూనే, మరో వైపున హీరోలుగా చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి కూడా అదే బాటలో ప్రయాణం చేస్తున్నాడు. చాలా కాలంగా తెరపై హాస్యంతో సందడి చేస్తూ వస్తోన్న శ్రీనివాస్ రెడ్డి, 'గీతాంజలి' సినిమాలో కీలకమైన రోల్ చేసి మెప్పించాడు. ఆ తరువాత 'జయమ్ము నిశ్చయమ్మురా'లో పూర్తిస్థాయి హీరోగా చేశాడు.

 ఇటీవల వచ్చిన 'ఆనందోబ్రహ్మ' .. మొన్న విడుదలైన 'రాజా ది గ్రేట్' శ్రీనివాస్ రెడ్డికి మరింత మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి హీరోగా మారుతున్నాడు. గతంలో సుమంత్ అశ్విన్ తో 'రైట్ రైట్' సినిమా చేసిన దర్శకుడు 'మను' .. ఓ రొమాంటిక్ కామెడీని తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో కథానాయకుడిగా శ్రీనివాస్ రెడ్డిని ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.   

More Telugu News