nagarjuna: మల్టీస్టారర్ మూవీ కోసం జనవరిలో సెట్స్ పైకి నాగ్, నాని?

  • శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మల్టీ స్టారర్ 
  • కథానాయకులుగా నాగార్జున, నాని 
  • అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి     

నాగార్జున .. నాని కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ రూపొందనుంది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అటు నాగార్జున అభిమానులు .. ఇటు నాని ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 ఈ సినిమా జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ తాజాగా వినిపిస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య 'భలేమంచి రోజు' సినిమాతో హిట్ కొట్టాడు. ఇక ఈ మధ్య వచ్చిన 'శమంతకమణి' సినిమా కూడా ఫరవాలేదనిపించింది. దాంతో సహజంగానే తాజా ప్రాజెక్టుపై అందరిలో ఆసక్తి వుంది. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.        

More Telugu News