Reliance: తాజా ప్లాన్లలో భారీ మార్పులు చేసిన జియో.. రూ.149కి డబుల్ డేటా

  • రూ.399 ధర  రూ.459కి పెంచిన వైనం
  • చాలా ప్యాక్‌లకు డబుల్ డేటా, కాలపరిమితి పెంపు
  • డైలీ, వీక్లీ ప్లాన్లు ప్రకటన.. నేటి నుంచే అమల్లోకి

రిలయన్స్ జియో తన తాజా ప్లాన్లను భారీగా సవరించింది. కొన్ని పాప్యులర్ ప్లాన్ల ధరలను పెంచగా, కొన్ని ప్లాన్లలో డేటాను రెట్టింపు చేసింది. ఖాతాదారుల అభిమానాన్ని చూరగొన్న రూ.399 ప్లాన్  ధరను 15 శాతం పెంచి రూ.459 చేసింది. గతంలో ఈ ప్లాన్ కాలపరిమితి 84 రోజులు కాగా, తాజాగా దానిని 70 రోజుకు కుదించింది. సవరించిన ప్లాన్లు నేటి నుంచి అమలుకానున్నట్టు జియో తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

రూ.399 ప్లాన్‌ ధరను రెట్టింపు చేసిన జియో రూ.149, రూ.509 ప్యాక్‌లకు ఇప్పటి వరకు ఇస్తున్న డేటాను రెట్టింపు చేసింది. గతంలో రూ.149 ప్లాన్‌లో వినియోగదారులకు 2జీబీ డేటా లభించగా దానిని రెట్టింపు చేసి 4జీబీ డేటా అందిస్తోంది. అలాగే రూ.509 ప్లాన్‌లో ప్రస్తుతం రోజుకు 1జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుండగా ఇకపై రోజుకు 2జీబీ డేటాను పొందవచ్చు.  

వీటితోపాటు డైలీ, వీక్లీ  ప్లాన్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఖాతాదారులు ఉచితంగా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్, 0.15 జీబీ డేటాను పొందవచ్చు. రోజుకు రూ.19, వారానికి రూ.52, రెండు వారాలకు రూ.98 చెల్లించి ఈ సేవలను వినియోగించుకోవచ్చని జియో పేర్కొంది. రూ.1,999 దీర్ఘకాలిక ప్లాన్‌లో గతంలో మూడునెలల కాలపరిమితి ఉండగా ఇప్పుడు దానిని ఆరు నెలలకు పెంచింది.  రూ.4,999 ప్లాన్‌లో గతంలో 210 రోజుల కాలపరిమితి ఉండగా తాజాగా దానిని ఏడాదికి పెంచింది.

More Telugu News