Nityamenon: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • సంగీతం నేర్చుకుంటున్న నిత్యా మీనన్ 
  • క్యాబ్ డ్రైవర్ పాత్రలో విజయ్ దేవరకొండ 
  • హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంలో తాప్సీ 
  • వచ్చే నెలలో సుమంత్ 'మళ్లీ రావా'!  


*  కథానాయిక నిత్యామీనన్ ఇప్పుడు సంగీతం నేర్చుకుంటోంది. అవును, ఈ ముద్దుగుమ్మకు చిన్నప్పటి నుంచీ సంగీతం అంటే ఇష్టమట. దాంతో ఇప్పుడు హిందూస్థానీ సంగీతాన్ని నేర్చుకుంటోంది. అన్నట్టు, గతంలో ఈ చిన్నది రెండు మూడు పాటలు పాడిన సంగతి విదితమే.
*  'అర్జున్ రెడ్డి' సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తాజాగా క్యాబ్ డ్రైవర్ పాత్రను పోషిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రంలో విజయ్ ఇలా క్యాబ్ డ్రైవర్ గా కనిపిస్తాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటిస్తోంది.
*   ప్రముఖ రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారుతున్నాడు. ఇందుకోసం ఓ లేడీ ఓరియెంటెడ్ కథను తయారుచేసుకున్నాడు. ఇందులో కథానాయిక పాత్ర కోసం ప్రస్తుతం తాప్సీని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
*  'నరుడా డోనరుడా' చిత్రం తర్వాత సుమంత్ చేస్తున్న చిత్రం 'మళ్లీ రావా'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే నెలలో రిలీజ్ చేస్తారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటించింది. 

More Telugu News