భారత్: మిఠాయిలు పంచుకున్న భారత్, పాక్ సైనికులు.. మీరూ చూడండి!

  • దీపావ‌ళి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా కలుసుకున్న ఇరు దేశాల సైనికులు
  • ఒకరికొకరు శుభాకాంక్షలు

దీపావ‌ళి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా భార‌త్‌, పాకిస్థాన్ సైనికులు ప‌ర‌స్ప‌రం మిఠాయిలు పంచుకుని శుభాకాంక్ష‌లు చెప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిస్తోంది. ముందుగా భారత్ సైనికులు పాకిస్థాన్‌ సైనికులకు మిఠాయిల బాక్సులు ఇచ్చారు. అనంత‌రం పాక్ సైనికులు కూడా భార‌త‌ జవాన్లకు స్వీట్లు ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఇరు దేశాల సైనికులు ఈ దృశ్యాల‌ను కెమెరాల్లో బంధించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల సైనికులు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఆ దృశ్యాన్ని మీరూ చూడండి..

More Telugu News