diwali: దీపావళి సందర్భంగా ప్రముఖుల శుభాకాంక్షలు!

  • ప్ర‌జ‌లంద‌రికీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు: నరసింహన్, కేసీఆర్
  • పండుగ జరుపుకుంటోన్న రామ్‌చ‌ర‌ణ్ తేజ్, రాధిక‌, రేణూ దేశాయ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్
  • భారీ శ‌బ్దాలు వచ్చే టపాసులు కాల్చద్దని సందేశం

దీపావ‌ళి సందర్భంగా రాజకీయ, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్ర‌జ‌లంద‌రికీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు. దీపావ‌ళిని ఘ‌నంగా జ‌రుపుకోవాలి. చెడుపై మంచి సాధించిన విజ‌యానికి ప్ర‌తీక‌గా దీపావ‌ళి జ‌రుపుకుంటాం’ అని గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ అన్నారు. ఈ దీపావ‌ళి ప్ర‌జ‌ల జీవితాల్లో కొత్త వెలుగులు తేవాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్ర‌జ‌లు సుఖ సంతోషాల‌తో జీవించేలా దీవించాల‌ని భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పారు.  

సినీన‌టులు రామ్‌చ‌ర‌ణ్ తేజ్, రాధిక‌, రేణూ దేశాయ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌మ అభిమానులకు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. దీప కాంతుల‌తో దీపావ‌ళిని జ‌రుపుకోవాల‌ని, భారీ శ‌బ్దాల‌తో వ‌ద్ద‌ని సందేశం ఇస్తున్నారు. త‌న భ‌ర్త రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు తాను దీపావ‌ళి వేడుక‌లను జ‌రుపుకుంటున్నాన‌ని తెలుపుతూ ఉపాసన ప‌లు ఫొటోలు పోస్ట్ చేసింది. అంద‌రికీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలుపుతున్నట్లు టీమిండియా మాజీ ఆట‌గాడు సెహ్వాగ్ పేర్కొన్నారు.     

More Telugu News